దశరా నవరాత్రుల ముగింపులో భాగంగా హైదరాబాద్ లోని షేక్ పేట డివిజన్ లో జరిగిన ఉత్సవాలకు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హాజరయ్యారు.
శ్రీనగర్ కాలనీలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దసరా సందర్భంగా భారీ ఎత్తున రావణ దహనం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ రావణ దహనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆయన వెంట పెద్ద ఎత్తున మహిళలు కూడా పాల్గొన్నారు.