తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్(TEA) మరియు NOPRUF (నేషనల్ ఓల్డ్ పెన్షన్ రెస్టోరేషన్ యునైటెడ్ ఫ్రoట్) సంయుక్తంగా కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు చేస్తున్న సడక్ యాత్ర నేడు హైదరాబాద్ చేరుకుంది. ఈ సందర్భంగా NOPRUF (నేషనల్ ఓల్డ్ పెన్షన్ రెస్టోరేషన్ యునైటెడ్ ఫ్రoట్) జాతీయ సలహాదారు చిలగాని సంపత్ కుమారస్వామి, జాతీయ అధ్యక్షులు బి.పి రావత్ ని కలిసి ములుగు జిల్లా సిపిఎస్ ఉద్యోగుల అందరి తరపున సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది.
సిపియస్ ఉద్యోగుల బాధలను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్(TEA) ములుగు జిల్లా అధ్యక్షులు గుల్లగట్టు సంజీవ, జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నవరం రవికాంత్, జిల్లా ఉపాధ్యక్షులు బోడ కుమారస్వామి, పట్టణాధ్యక్షులు కలాలి మొగిలి తదితరులు పాల్గొన్నారు.