ఈ జిల్లా కలెక్టర్ అందరికి ఆదర్శం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభుత్వ పాఠశాలలపై ఎంతో శ్రద్ధ చూపే ఆమె వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆయేషా. నేడు కలెక్టర్ ఆయేషా కొడంగల్ నియోజకవర్గం రావులపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించారు.
అక్కడి పర్యావరణ పరిస్థితులు అన్నీ పరిశీలించిన తర్వాత విద్యార్ధుల విద్యా బోధన విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె స్వయంగా ఉపాధ్యాయురాలిగా మారి విద్యార్ధులకు లెక్కలు బోధించారు. బోర్డుపై రాస్తూ లెక్కలు విపులంగా విశ్లేషిండమే కాకుండా విద్యార్ధులు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇచ్చారు. దటీజ్ కలెక్టర్ ఆయేషా.