భారత్ లో ఉంటూ, భారత్ లో తింటూ భారత్ పై విషం చిమ్మే హురియత్ కాన్ఫరెన్సు లో చీలికలు వచ్చాయి. దాదాపు దశాబ్ద కాలం కిందట ఏర్పాటైన ఆల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్స్ జమ్మూ కాశ్మీర్ లో భారత్ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించేది. పాకిస్తాన్ లోని హురియత్ కాన్ఫరెన్సుకు అనుబంధంగా పని చేసే ఈ సంస్థకు ఆవిర్భావం నుంచి నాయకుడుగా సయ్యద్ అలీషా జిలానీ వ్యవహరించారు.
అయితే పాకిస్తాన్ హురియత్ కాన్ఫరెన్సుతో విభేదాలు, హురియత్ కాన్ఫరెన్సులోని వివిధ రాజకీయ, సామాజిక సంస్థలు స్వతంత్రంగా వ్యవహరించడం తో జిలానీ మనస్తాపం చెంది పదవి నుంచి వైదొలగారు. 90 సంవత్సరాల జిలానీ వయోభారంతో వైదొలగారని అంటున్నా వివిధ సంస్థల మధ్య పెరిగిపోతున్న విభేదాల కారణంగానే ఆయన వైదలిగినట్లు మరి కొందరు చెబుతున్నారు.
జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత స్థానిక నాయకులు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. అందులో భాగంగా చాలా సంస్థల కార్యకలాపాలు నిలిచిపోయాయి.