జిల్లా కలెక్టర్ అనుదీప్ కొత్తగూడెం మున్సిపాలిటీలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. ఎల్ఐసి కార్యాలయ వద్ద నిర్మిస్తున్న గ్రంధాలయ నిర్మాణ పనులు, ప్రగతి మైదానంలో నిర్మించనున్న రెండు టెన్నిస్ కోర్టులు, అథ్లెటిక్ ట్రాక్, దివ్యాన్గుల కమ్యూనిటీ హాలు, రామవరం సాధన మైదానంలో నిర్మించనున్న బ్యాడ్మింటన్ కోర్ట్ నిర్మాణ పనులను ఆకస్మిక తనిఖీ చేశారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యత పాటించాలని, నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
previous post
next post