సిరిసిల్లజిల్లా ఇల్లంతకుంట మండలం రామోజీపేట గ్రామంలో దళితులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ హైదరాబాద్ లో ఎంఆర్ పిఎస్ నిరసన వ్యక్తం చేసింది.
ఈ మేరకు వారు హైదరాబాద్ లో నేడు అంబర్ పేట MRO కు మెమోరాండం ఇచ్చారు. దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేసి SC ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు.
బాధితులను ఆదుకొని నష్ట పరిహారం చెలించాలని MRPS.MSP పార్టీ డిమాండ్ చేసింది. బడుగుల బాలకృష్ణ మాదిగ అంబర్ పేట నియోజకవర్గ ఇంచార్జి ఈటా దర్శన్, కాచిగూడ డివిషన్ ఇంచార్జీ ఆర్వింద్,
మీర్యాయల అరుణ్, అంబర్ పెట్ సత్యనారాయణ, గోల్నాక డివిషన్ ఇంచార్జి మహేందర్, నరేందర్ గణేష్, అశోక్, పృధివి రాజ్, భారత తదితరులు పాల్గొన్నారు.