శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు కాలనీ సంక్షేమ సంఘాల భాగస్వామ్యం అవసరమని కుషాయిగూడ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం వివిధ కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు ఇటీవల కుషాయిగూడ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ కుమార్ ని కలుసుకొని పుష్పగుచ్చం అందజేసి శాలువాలతో సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ కాలనీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసు పరంగా తమ సహకారం ఎల్లవేళలా ఉంటుందని చెప్పారు. కుషాయిగూడ ఠానా పరిధిలో రాత్రి వేళల్లో పోలీస్ గస్తీని వేగవంతం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ అడ్మిన్ ఎం పల్లి పద్మా రెడ్డి ప్రతినిధులు డాక్టర్ కుమారస్వామి నరసింహారెడ్డి రమేష్ గౌడ్ బాలాజీ నాయక్ సత్తయ్య షాబాద్ దామోదర్ రెడ్డి సత్యనారాయణ, సత్యనారాయణ రెడ్డి, తిరుమలరెడ్డి, రామచంద్రారెడ్డి, పురుషోత్తం, రామకృష్ణ, శ్రీనాథ్, వంశీ, రవి తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా