పేద ప్రజల సంక్షేమమే ప్రధాన ఆశయంగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని టిఆర్ఎస్ పార్టీ ములుగు మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్ పేర్కొన్నారు. ములుగు మండల పరిధిలోని లబ్దిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను ఈరోజు స్థానిక నాయకులతో కలిసి అందజేశారు.
మదనపల్లి గ్రామానికి చెందిన పి కమలాబాయ్ కుటుంబసభ్యులకు రూ.25,000వేల చెక్కును, ఇంచర్ల గ్రామానికి చెందిన ఏ కావ్య కు 51,000 రూపాయల చెక్కును, రంగారావు పల్లె గ్రామానికి చెందిన ఎల్ కవితకు 37,500 చెక్కును, కె వెంకటలక్ష్మి కి 21,000 వేల రూపాయల చెక్కులను ములుగు మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్ అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని అన్నారు.
నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే వేలాది కుటుంబాలను సీఎం సహాయ నిధి ద్వారా ఆదుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు పోరిక విజయరామ్ నాయక్ ఇంచర్ల ఎంపీటీసీ పూజారి శ్రీనివాస్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ శీలం మధు సీనియర్ నాయకులు వేల్పూరి సత్యనారాయణ ములుగు మండల యూత్ అధ్యక్షుడు బైకానీ సాగర్ ములుగు మండల బిసి సెల్ అధ్యక్షుడు మామిడి అశోక్ మాదం సాగర్ క్లాసిక్ రవి రమేష్ తదితర టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.