ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైఖరి మార్పు కోవాలని, బి ఆర్ స్ లో ఉండి, దానికే ద్రోహం చేయాలనుకోవడం దారుణం అని ఖమ్మం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు.
ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ తాతా మధు విలేఖరులతో మాట్లాడుతూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై మండిపడ్డారు. 7 సం.లు పార్టీలో ఉండి ఇదే పార్టీకి ద్రోహం చేయాలని పోంగులేటి శ్రీనివాసరెడ్డి చూస్తున్నాడని మధు ఆరోపించారు.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జరిగిన అభివృద్ధి మరే రాష్ట్రంలో జరగలేదన్నారు. 9 సం.లు రాష్ట్ర ప్రజల కలలు నెరవేరలేదని చెప్పటం ఆస్యస్పదంగా ఉందన్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. కెసిఆర్, కేటీర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎమ్మెల్సీ మధు హెచ్చరించారు.