36.2 C
Hyderabad
April 27, 2024 22: 12 PM
Slider ముఖ్యంశాలు

రాజకీయాన్ని వ్యాపారం చేయడాన్ని ముక్తకంఠంతో ఖండించాలి…!

#Ashok Gajapathi Raju

ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో రాజకీయం ఓ వ్యాపారంగా మారిపోయిందని కేంద్ర మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత పోలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు ఆవేదన వ్యక్తం చేశారు.ఏపీ ఉమ్మడి రాష్ట్ర సీఎం గాను ,టీడీపీ వ్యవస్థాపకులు దివంగత నేత ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా విజయనగరంలో కోట జంక్షన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు… అశోక్ గజపతిరాజు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…

ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ ఓ వ్యాపారంగా మార్చేశారని…అసలు తెలుగు వారి కోసం ఆవిర్భవించిన రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన వారినే మరచి పోయే స్థితికి రాష్ట్ర దిగజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ కందుకూరి, ఓ గురజాడ వంటి మహానీయులను గుర్తు పెట్టుకోవలసిన అగత్యం ఏర్పడే పరిస్థితి కి రాష్ట్రాన్ని దిగజార్చారని అశోక్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక కోట జంక్షన్ వద్ద అనంతరం…

నగరంలో న్యూపూర్ణ ,అలాగే కలెక్టరేట్ జంక్షన్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నేతలు పూలదండలు వేసి నివాళులు అర్పించిన అనంతరం పేదలకు బట్టలు పంపిణీ తో పాటు అన్నదానం చేశారు.ఈ ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమంలో టీడీపీ నేతలు ఐవీపీ రాజు ,ప్రసాదుల లక్ష్మీ వర ప్రసాద్ ,కనకల మురళి, విజ్జపు ప్రసాద్…తదితరులు హాజరయ్యారు.

Related posts

చుక్కలను చూపిస్తున్న పసుపు, కుంకుమ ధరలు…

Satyam NEWS

కడప తెలుగుదేశం అధ్యక్షుడికి కరోనా పాజిటీవ్

Satyam NEWS

(Best) Cbd Hemp Oil 100 Thc Free Does It Work Cbd Infused Vape Juice Bio Nutrition Cbd Hemp Oil 79 1 Oz

Bhavani

Leave a Comment