మెక్సికన్ అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ ప్రపంచ శాంతి ఒప్పందాన్ని ప్రోత్సహించడానికి ఒక కమిషన్ను రూపొందించాలని ఐక్యరాజ్యసమితికి వ్రాతపూర్వక ప్రతిపాదనను సమర్పించాలని యోచిస్తున్నారు. ఐదేళ్లపాటు ఉండే ఈ కమిషన్లో ప్రధాని నరేంద్ర మోదీ సహా ముగ్గురు ప్రపంచ నేతల పేర్లను ఆయన ప్రతిపాదించనున్నారు.
“నేను లిఖితపూర్వకంగా ఈ ప్రతిపాదన చేస్తాను, నేను దానిని ఐక్యరాజ్యసమితికి అందిస్తాను” అని ప్రెసిడెంట్ ఒబ్రాడర్ అన్నారు. అపెక్స్ కమిషన్లో పోప్ ఫ్రాన్సిస్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉండాలని మెక్సికో అధ్యక్షుడు ప్రతిపాదించారు. కమీషన్ ఉద్దేశ్యం ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను నిరోధించడానికి, కనీసం ఐదు సంవత్సరాల పాటు ఒక ఒప్పందం కోసం ఒక ప్రతిపాదనను సమర్పించడం.
వారు ముగ్గురూ కలుసుకుని, ప్రతిచోటా యుద్ధాన్ని ఆపాలని ప్రతిపాదిస్తారు. కనీసం ఐదేళ్లపాటు ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు తమ ప్రజలకు సహాయం చేయడానికి తమను తాము అంకితం చేసుకోగలవు. ప్రత్యేకించి మనం ఐదేళ్లపాటు టెన్షన్ లేకుండా, హింస లేకుండా గడిపేందుకు బాధలకు, యుద్ధం లాంటి చర్యలకు స్వస్తి పలకాలని పిలుపునిస్తూ నిర్ణయం తీసుకుంటారు.
చైనా, రష్యా, అమెరికా ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యారు. ద్రవ్యోల్బణాన్ని పెంచారు. మరింత పేదరికం, ఆహార కొరత సృష్టించారు. ఒక సంవత్సరంలో చాలా మంది సంఘర్షణ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీన్ని కనీసం ఐదేళ్లు ఆపితే ప్రపంచం మొత్తం ఇలాంటి బాధల నుంచి విముక్తి అవుతుంది. ఇలాంటి బాధల నుంచి కోలుకుంటుంది.