38.2 C
Hyderabad
April 27, 2024 18: 53 PM
Slider వరంగల్

భూకబ్జాదారునిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి

#bccommission

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదుర్ మండల పరిధిలోని నర్సింహుల గూడెం గ్రామపంచాయతీలోని సర్వేనెంబర్ 21లోని తమ భూమిలో అక్రమంగా ప్రవేశించి అక్రమంగా భూకబ్జాకు పాల్పడుతున్న నెల్లికుదుర్ జెడ్పిటిసి మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి, అతని అనుచరులపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివారం బాధిత రైతు కుమారులు నమ్ముల నరేష్, సత్యనారాయణలు జాతీయ బిసి కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారిని కలసి ఫిర్యాదు చేశారు. భూకబ్జాకు పాల్పడుతున్న విషయం తెలుసుకొని అడ్డుకోబోయినా తమ తండ్రి పైన దాడిచేసి గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే 100 సహాయంతో స్థానిక పొలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన  పోలీసు, రెవిన్యూ అధికారులు పట్టించుకోవడం లేదంటూ వాపోయారు. జెడ్పిటిసి, అతని అనుచరులు లపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు.

Related posts

టవర్ క్లాక్ బ్రిడ్జి అవకతవకలపై విచారణ జరపాలి

Bhavani

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కోతికొమ్మచ్చి టీమ్

Satyam NEWS

హై కోర్టు తీర్పును పెడచెవిన పెడుతున్న జగన్ సర్కార్

Satyam NEWS

Leave a Comment