మేఘాంశ్ శ్రీహరి, సమీర్ వేగేశ్నలు హీరోలుగా కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన దర్శకుడు వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘కోతి కొమ్మచ్చి’ .
లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం.ఎల్.వి సత్యనారాయణ (సత్తిబాబు) ఈ సినిమా నిర్మిస్తున్నారు. అలనాటి హీరోలు రాజేంద్రప్రసాద్, నరేష్, దర్శకుడు వేగేశ్న సతీష్ లు దీపావళి సందర్భంగా చిత్రాన్ని, చిత్ర యూనిట్ ను పరిచయం చేశారే.
యూత్ ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని విజయదశమి పర్వదినం రోజు ప్రారంభించామని దర్శకుడు వేగేశ్న సతీష్ తెలిపారు.
రిద్ది కుమార్ , మేఘ చౌధురి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనుప్ రుబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించనున్నారు.
కోతికొమ్మచ్చి టీమ్ తెలుగు ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపింది