బాలక్ భీమ్ బనో కార్యక్రమం వాల్ పోస్టర్ ను కూకట్ పల్లి లో విడుదల చేశారు. ఈనెల23వ తేదీన హన్మకొండ ప్రభుత్వ పాఠశాల మైదానంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కూకట్ పల్లి స్వేరో సర్కిల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆల్విన్ కాలనీ డివిషన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో స్వేరో సర్కిల్ సొసైటీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఎర్ర యాకయ్య, నాయకులు శివరాజ్ గౌడ్, నర్సింహ, తదితరులు పాల్గొన్నారు.