సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో ఆర్యవైశ్య సంఘ భవన్ లో ఓరుగంటి నరసింహారావు అధ్యక్షతన భారత్ – చైనా మధ్య జరిగిన ఘర్షణ సంఘటనలో గాల్వన్ వద్ద వీరమరణం పొందిన భరతమాత ముద్దు బిడ్డ కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు సంతాప సభ జరిగింది.
ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ, కల్నల్ సంతోష్ బాబు దేశానికి అందించిన సేవలు కొనియాడుతూ అతని ఆత్మకు శాంతి కలగాలని అలాగే వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో వంగవేటి హనుమంతరావు, పోలిశెట్టి నరసింహారావు, ఓరుగంటి నాగేశ్వరరావు, మాశెట్టి ఆనంతరాములు పాల్గొన్నారు.
ఇంకా, గుండా రమేష్, బచ్చు రామారావు, పోలిశెట్టి వెంకటేశ్వర్లు, నీరుమళ్ల . నరసింహారావు, ఈగ కోటేశ్వరరావు, పెనుగొండ శ్రీనివాస్, కామిశెట్టి నందయ్య, పోలిశెట్టి మోహనరావు, గెల్లి విద్యాసాగర్, CH. నాగేశ్వరరావు, బొడ్డు రమేష్ తదితరులు పాల్గొన్నారు. తదనంతరం గాంధి పార్క్ సెంటర్ లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భోజన పాకెట్స్ పంచారు.