31.7 C
Hyderabad
May 2, 2024 07: 08 AM
Slider నల్గొండ

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కల్నల్ సంతోష్ సంతాప సభ

#Condolence meeting

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో ఆర్యవైశ్య సంఘ భవన్ లో ఓరుగంటి నరసింహారావు అధ్యక్షతన  భారత్ – చైనా మధ్య జరిగిన  ఘర్షణ సంఘటనలో గాల్వన్ వద్ద వీరమరణం పొందిన భరతమాత ముద్దు బిడ్డ కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు సంతాప సభ జరిగింది.

ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ, కల్నల్ సంతోష్ బాబు దేశానికి అందించిన సేవలు కొనియాడుతూ అతని ఆత్మకు శాంతి కలగాలని అలాగే వారి కుటుంబానికి ప్రగాఢ  సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో వంగవేటి హనుమంతరావు, పోలిశెట్టి నరసింహారావు, ఓరుగంటి నాగేశ్వరరావు, మాశెట్టి ఆనంతరాములు పాల్గొన్నారు.

ఇంకా, గుండా రమేష్, బచ్చు రామారావు, పోలిశెట్టి వెంకటేశ్వర్లు, నీరుమళ్ల . నరసింహారావు, ఈగ కోటేశ్వరరావు,  పెనుగొండ శ్రీనివాస్, కామిశెట్టి నందయ్య, పోలిశెట్టి మోహనరావు, గెల్లి విద్యాసాగర్, CH. నాగేశ్వరరావు, బొడ్డు రమేష్ తదితరులు పాల్గొన్నారు. తదనంతరం గాంధి పార్క్ సెంటర్ లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భోజన పాకెట్స్ పంచారు.

Related posts

ఎమ్మెల్యే కోలగట్ల జన్మదినం సందర్భంగా కబడ్డీ పోటీలు

Satyam NEWS

బాబును అడ్డుకోవడంపై డీజీపీకి హైకోర్టు నోటీసు

Satyam NEWS

వనపర్తిలో శ్రమదానం చేసిన వైస్ వాకిటి శ్రీధర్

Satyam NEWS

Leave a Comment