ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పోరాడేందుకు తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతున్నది.
ఇందులో భాగంగా పార్లమెంటు నియోజకవర్గాలకు కొత్త ఇన్ చార్జిలను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు నియమించారు.
నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షుడుగా జీ.వీ ఆంజనేయులు నియమితులయ్యారు. ఈ సందర్భంగా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
అదేవిధంగా పార్లమెంట్ కోఆర్డినేటర్ గా నియమితులైన పితాని సత్యనారాయణ కు డాక్టర్ అరవిందబాబు ఫోన్ లో శుభాకాంక్షలు తెలియచేశారు.