కడప జిల్లా రాజంపేట మండలం తాళ్ళపాకలోని చారిత్రక ప్రసిద్ధి పొందిన శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం, శ్రీ సిద్దేశ్వర స్వామివారి ఆలయాల్లో వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఈ రెండు అలయాల్లో వేరువేరుగా ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించారు.
అర్చకులు శాస్త్రోక్తంగా ధ్వజ పటం ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాలు ఏకాంతంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల వాహనసేవలు కూడా ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో టిటిడి డెప్యూటీ ఈఓ లోకనాథం, సూపరింటెండెంట్ నాధముని, టెంపుల్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.