38.2 C
Hyderabad
April 29, 2024 12: 14 PM
Slider హైదరాబాద్

ప్రొటెస్టు డే: రేవంత్ అరెస్టుకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు

l b nagar 2

మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్ ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలు చేశారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి, రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ల కు తరలించారు.

ఈ రోజు ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎనుమల రేవంత్ రెడ్డి అరెస్టు నిరసనగా ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలో చింతకుంట, విజయవాడ నేషనల్ హైవే పై ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు.

అనంతరం రోడ్డు పై బైటాయించి ప్రభుత్వ చర్యకు నిరసన వ్యక్తం చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొప్పుల నర్సింహ్మా రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి పహాడిషరీఫ్ పోలీస్ స్టేషను తరలించారు.

మల్కాజ్ గిరి ఎంపి ప్రభుత్వ అక్రమాలను బయటపెడితే అరెస్టు చేయడం దారుణమని ఈ సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొప్పుల నర్సింహ్మా రెడ్డి అన్నారు. తక్షణమే రేవంత్ రెడ్డిని బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Related posts

సంబరాలకు బదులు సహాయం చేయండి

Satyam NEWS

బ్రహ్మం గారి మఠం లో తెరుచుకున్న ఆలయం

Satyam NEWS

అభివృద్ధి పనులకు భూమిపూజ శంకుస్థాపన

Satyam NEWS

Leave a Comment