నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళ కోవిడ్ వైరస్ తో మరణించింది. మృతురాలి కుటుంబ సభ్యులకు ఏం చేయాలో తెలీక ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ సాజిద్ ఖాన్ కు సమాచారం అందించారు.
సాజిద్ ఖాన్ తక్షణమే రిమ్స్ ఆసుపత్రి కి చేరుకొని మున్సిపల్ సిబ్బంది, కోవిడ్ వార్డు సిబ్బంది, పోలీసు అధికారుల తో మాట్లాడారు.
కోవిడ్ మృతదేహాన్ని మున్సిపల్, పోలీసు అధికారుల సమక్షంలో స్వాధీన పరుచుకుని మత లాంఛనాలతో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ అంత్యక్రియలు నిర్వహించారు.
అనంతరం మృతుడి కుటుంబ సభ్యులు సాజిద్ ఖాన్ చేసిన సహాయానికి ధన్యవాదాలు తెలిపారు.