కాంగ్రెస్ సీనియర్ లీడర్ జి.నరేందర్ యాదవ్ ను కరోనా పొట్టన పెట్టుకున్నది. హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ లో కీలక నాయకుడుగా ఉన్న నరేందర్ ఇటీవల పలు సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. కరోనా బారిన పడ్డ రోగులకు పరామర్శించి వారికి సహాయం చేశాడు.
ఈ సందర్భంగానే ఆయనకు కరోనా వైరస్ సోకింది. కరోనా పాజిటీవ్ రాగానే ఆయనను యశోద ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. అయితే ఆయన మరణించారు. ఆయన మరణం హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు.