29.7 C
Hyderabad
April 29, 2024 10: 29 AM
Slider రంగారెడ్డి

మామిడిపల్లి కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరిక

bjp mamidi pally

కాషాయదళంలో చేరేందుకు మహేశ్వరం నియోజకవర్గంలో అనేకమంది ఆసక్తి చూపుతున్నారని మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్ అన్నారు. ఇవాళ బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి, ఓబీసీ అధ్యక్షులు పెరమోనీ నరేశ్ యాదవ్ ఆధ్వర్యంలో మామిడిపల్లికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరారు. వీరందరికీ కాషాయం కండువాలు కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు శ్రీరాములు.


జీహెచ్ఎంసీ మేయర్ బీజేపీదే- అందెల


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామన్నారు. దుబ్బాక దెబ్బతో కారు బోల్తాపడిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ గాలివీస్తోందన్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీ చేరిన నాయకులకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు చెరుకుపల్లి వెంకటరెడ్డి, పెరమోనీ నరేశ్ యాదవ్. బీజేపీలో చేరిన కాంగ్రెస్ మాజీ సింగిల్ విండో ప్రెసిండెంట్ ఎలగపల్లి యాదగిరి యాదవ్, కాంగ్రెస్ స్టేట్ మైనార్టీ కన్వీనర్ మహమ్మద్ నయీమ్, కాంగ్రెస్ ఓబీసీ సెల్ ప్రెసిడెంట్ గుర్జనీ గణేశ్ గౌడ్, కడారి రమేశ్, జనిగె శంకర్, కడారి మల్లేశ్, శ్రీహరి యాదవ్, సాయిరామ్, యాదగిరి, శ్రీనివాస్, రమనమోనీ మహిపాల్, వేణు సహా ఇతరులు కండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం మల్లారెడ్డి, జనరల్ సెక్రటరీలు జోరాల ప్రభాకర్, దొడ్డి మల్లికార్జున్, మద్ది జగన్నాథ్ రెడ్డి, జగన్ ముదిరాజ్ పాల్గొన్నారు.

Related posts

సీఎం కేసీఆర్ 12 గంటల బడ్జెట్ కసరత్తు

Satyam NEWS

సీనియర్‌ నటి జయప్రదకు 6 నెలల జైలు శిక్ష

Satyam NEWS

పాదచారులకు రక్షణ… ఆకాశ వంతెన

Satyam NEWS

Leave a Comment