కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని పెద్దదేవాడ వాజీద్నగర్ గ్రామాలలో కాంగ్రెస్ దళిత దండోరా సభ శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగారాం మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలంను దళిత బందు ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
కానీ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు ఇది వర్తింపచేయాలంటే ప్రస్తుతమున్న జుక్కల్ శాసనసభ్యులు హనుమంత్ షిండే రాజీనామా చేయాలని ఆయన రాజీనామా చేస్తే ఆయన కొరకు ప్రత్యేకంగా ప్రచారం చేసి మళ్లీ గెలిపిస్తానన్నారు. తెరాస పార్టీ టిక్కెట్ ఇవకు౦టే ఇండిపెండెంట్ గా గానీ ఆయన కొరకు ప్రచారం చేసి గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు.
తాను నియోజకవర్గంలో ఆస్తులు కూడగడితే ప్రస్తుతమున్న ఎమ్మెల్యే మహారాష్ట్ర కర్నాటకలో భూములు కొనుక్కుంటున్నారని ఆరోపించారు. అనంతరం జహీరాబాద్ పార్లమెంటు నాయకులు మదన్ మోహన్ రావు మాట్లాడుతూ కేసీఆర్ మాయలో ప్రజలెవరూ పడ రాదని ఇప్పటికే ఆయన గతంలో ఎన్నికల ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు.
మొదటి నుండి దళితులకు మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. దళితులకు ముఖ్యమంత్రి పదవి అన్నాడు మూడెకరాల భూమి డబుల్ బెడ్రూం ఇళ్ల అన్నాడు కానీ ఏదీ కూడా చేయలేకపోయాడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కాంగ్రెస్ కార్యకర్తలందరూ కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలన్నారు.
రేవంత్ రెడ్డి పిసిసి గా వచ్చినప్పటి నుండి తెరాసలో వణుకు పుట్టిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు సర్పంచ్ లు ఎంపిటిసిలు సహకార సంఘం అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు.