జీహెచ్ఎంసి ఎన్నికలు తప్పుడు పద్ధతుల్లో నిర్వహించారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఒక వీడియోను ఉంచారు.
17 సంవత్సరాల ఒక బాలుడిని అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారిగా నియమించి ఎన్నికలు నిర్వహించిన సంఘటనను ఆయన వీడియో సాక్ష్యంతో సహా నిరూపించారు.
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ సంఘటనతో సిగ్గుపడాలని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్ర హైకోర్టు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ తప్పుడు ఎన్నికలపై విచారణ జరిపించాలని ఆయన కోరారు.