23.2 C
Hyderabad
May 7, 2024 23: 43 PM
Slider మహబూబ్ నగర్

రోడ్ల వెడల్పులో నష్టపోయిన వారిని ఆదుకుంటా

#megareddy

వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలో  విలువైన సంత స్థలాన్ని  అధికారంలోకి రాగానే  (సంత స్థలాన్ని) సెంటు భూమితో సహా తిరిగి తీసుకుంటామని వనపర్తి కాంగ్రెస్ అభ్యర్థి తూడి మేఘారెడ్డి హామీ ఇచ్చారు. పెబ్బేరులో అయన మాట్లాడుతూ రోడ్ల వెడల్పులో ఇండ్లను కోల్పోయిన వారికి, వ్యాపార సముదాయాలను కోల్పోయిన వారికీ  అన్యాయం జరిగిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రోడ్డు బాధితులకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. వనపర్తి నియోజకవర్గంలో బి ఆర్ఎస్ పార్టీ నాయకులు స్థానికంగా ఉండే నాయకులపై నమ్మకం లేక తన సొంత ఇంటి వారికి  బాధ్యతలు ఇచ్చారని చెప్పారు.  గౌరవించని చోట ఉండడం కంటే గౌరవింపబడే చోటికి రావాలని బిఆర్ఎస్ నాయకులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వెంకటరమణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, సిపిఐ పార్టీ నాయకులు జగదీష్, శాంతమూర్తి, నాయకులు రాజశేఖర్, రాంరెడ్డి  పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

సెప్టెంబర్ 1 నుండి ఖమ్మం లో అగ్నివీర్ ర్యాలీ

Bhavani

మహిళా దినోత్సవం సందర్భంగా “రన్ ఫర్ వుమెన్ సేఫ్టీ”

Satyam NEWS

సీఎం కేసీఆర్ భేటీ!!!

Sub Editor

Leave a Comment