ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమ ప్రభుత్వం ఏర్పడుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి అన్నారు. మండలంలోని మంగాపురం తండా, చిన్నతండాల్లో శుక్రవారం గడపగడపకూ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఇంటింటికీ వెళ్లి అందరినీ పలకరిస్తూ సమస్యలు తెలుసుకున్నారు. పింఛన్లు సరిగ్గా రావట్లేదని, అర్హులకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించలేదని పలువురు ఆయనకు మొర పెట్టుకున్నారు.
ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అర్హులందరికీ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుందని ధైర్యం చెప్పారు. ఆరు గ్యారెంటీల గురించి వివరించి చెప్పారు. వచ్చేది ఇందిరమ్మ రాజ్యమేనని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితేనే ప్రజలందరికీ సంక్షేమం దక్కుతుందని పొంగులేటి ప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మట్టా దుర్గాప్రసాద్ రెడ్డి, సీత్యా, శ్రీను, గోప్యా, రాధాకృష్ణా, నెల్లూరి భద్రయ్య, చెర్వు స్వర్ణ, కొడాలి గోవిందరావు, నరేష్, మామిడి వెంకన్న, తేజావత్ శివాజీ, ఎస్. గురునాధం, కుక్కల నగేష్, రాజా, భూక్యా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.