Slider రంగారెడ్డి

ఉప్పల్ గడ్డ పై కాంగ్రెస్ జెండా ఏగురవేయడం ఖాయం

#mandamulaparameswarareddy

రానున్న శాసనసభ ఎన్నికల్లో ఉప్పల్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని  ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మందముల పరమేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. కాప్రా సర్కిల్ పరిధిలోని కుషాయి గూడ బస్ డిపో సమీపంలోని బంజారా ఫంక్షన్ హాల్లో ఉప్పల్ బి బ్లాక్ కాప్రా సర్కిల్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బి బ్లాక్ డివిజన్ల అధ్యక్షుడు మాట్లాడుతూ బి బ్లాక్ లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని ఉప్పల్ గడ్డ పై  కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని అన్నారు.

కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాని నాయకులతో మాట్లాడతానని అందర్నీ కలుపుకొని ముందుకు సాగుతామని తెలిపారు. బిఆర్ఎస్ అభ్యర్థి అన్నీ కల్లబోల్లి మాటలని, ప్రజలు బిఆర్ఎస్ ను నమ్మే ప్రసక్తి లేదని అన్నారు. బిఆర్ఎస్ అభ్యర్థి తాను ఏ అధికారంతో జీవోలు తీసుకొచ్చారో చెప్పాలన్నారు. కేవలం ఉప్పల్ ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా బిఆర్ఎస్ అభ్యర్థి వ్యవహార శైలి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బొజ్జ రాఘవ రెడ్డి, కొత్త అంజి రెడ్డి, గడ్డం యాదగిరి,సముద్రాల క్రిష్ణ మూర్తి,పెద్ది శ్రీనివాస్ గుప్త, పత్తి కుమార్,సీతారాం రెడ్డి,కాసుల పోచయ్య, గోపాల్ యాదవ్,ముస్తాక్,పెద్ది నాగరాజు, ప్రేమ్ గౌడ్,నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

శశిథరూర్‌ కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

Satyam NEWS

ములుగు  జిల్లా కేంద్రంలో తైక్వాండో పోటీలు

Satyam NEWS

సంబరంగా అంతర్జాతీయ బాలికల దినోత్సవం

Satyam NEWS

Leave a Comment