విజయనగరంలో ట్రాఫిక్ పోలీసు స్టేషను ను విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు ఏఎస్పీ అస్మా ఫర్హీన్ ,ట్రాఫిక్ డీఎస్పీ విశ్వనాథ్ లు…డీఐజీ కి స్వాగతం పలికారు. తన వార్షిక తనిఖీల్లో భాగంగా విశాఖ రేంజ్ డీఐజీ ఎస్.హరికృష్ణ…విజయనగరం కు వచ్చి ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ను సందర్శించారు. ఈ మేరకు నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ట్రాఫిక్ సిబ్బంది కి సూచనలు ఇచ్చారు. ఓవర్ లోడు వాహనాలపై చర్యలు చేపట్టి, వాటిపై నిబంధనలు మేరకు ఎం.వి.చలానాలు విధించాలి అని అన్నారు.
నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. స్టేషను రికార్డులు, సిడి ఫైల్స్, రిసెప్షన్ పని తీరును, స్టేషను ప్రాంగణం ను డీఐజీ హరికృష్ణ గారు పరిశీలించి, సంతృప్తిని వ్యక్తం చేశారు. ట్రాఫిక్ పోలీసు సిబ్బందితో డీఐజీ మమేకమై, వారి సమస్యలను తెలుసుకున్నారు.ట్రాఫిక్ డిఎస్పీ డి. విశ్వనాథ్, ట్రాఫిక్ ఎస్ఐలు లోవారాజు, ఎ.ఎం.రాజు, త్రినాథరావు మరియు ఇతర అధికారులు వార్షిక తనిఖీల్లో పాల్గొన్నారు.