37.2 C
Hyderabad
May 1, 2024 12: 15 PM
Slider కరీంనగర్

ట్రాజెడీ: మానేరు వంతెనపై నుంచి పడ్డ కానిస్టేబుల్ మృతి

constable died

కరీంనగర్ హైవేపై తిమ్మాపూర్ మండలం లోని అలుగునూర్ మానేరు వంతెనపై జరిగిన ప్రమాదంలో సహాయ చర్యలు పర్యవేక్షిస్తూ కింద పడిన కానిస్టేబుల్ మరణించాడు. అత్యంత దురదృష్టకరమైన ఈ సంఘటనలో కరీంనగర్.1 టౌన్ బ్లూ కోటుకు చెందిన కానిస్టేబుల్ చంద్రశేఖర్ బ్రిడ్జిపై నుంచి కింద పడిపోయాడు.

సంఘనా ప్రాంతాన్ని పరిశీలిస్తుండగా వంతెన పై నుంచి కింద కాల్వలో పడటంతో కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కానిస్టేబుల్ ను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. కాగా, చికిత్స పొందుతూ కానిస్టేబుల్ మృతి చెందాడు.

ఇదిలా ఉండగా, మంత్రి గంగుల కమలాకర్ సంఘటన స్థలానికి వెళ్లి సమీక్షిస్తున్నారు. హైవే లో లారీ కారు ఢీ కొనడంతో కారు పల్టీ కొట్టి కాల్వలో పడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరణించిన వ్యక్తి భార్య షాక్ లో ఉండగా చికిత్స అందిస్తున్నారు.

Related posts

ఏడేళ్లలో ఏడువేల మంది రైతులు ఆత్మహత్య

Satyam NEWS

దేశాన్ని దోచుకుతింటున్న గుజారాతీలు

Satyam NEWS

ఖమ్మం అభివృద్ధికి యస్ డియఫ్ నిధులు

Murali Krishna

Leave a Comment