35.2 C
Hyderabad
May 1, 2024 00: 47 AM
Slider తెలంగాణ

బి.ఆర్.కె.ఆర్ భవన్ లో Constitution Day

Constitution Day

భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ అసెంబ్లీ ఆమోదించి 70 సంవత్సరాలు అయిన సందర్భంగా రాజ్యాంగ ప్రవేశికల తొలిపలుకులను (Preamble Constitution of India) సచివాలయ సిబ్బందిచే  జిఏడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా చదివించారు. మంగళవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో  Constitution Day ను పాటించారు. జిఏడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తో పాటు, Law Secretary  సంతోష్ రెడ్డి సిబ్బందిచేత Constitution Preamble ను చదివించారు. కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి ఆదేశాల మేరకు Constitution Day ను పురస్కరించుకొని రాజ్యాంగంలోని ముఖ్యాంశమైన ప్రాధమిక విధులపై నవంబర్ 26 నుండి 14-4-2020 వరకు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశామని జిఏడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా తెలిపారు. భారత రాజ్యాంగం గొప్పతనాన్ని, విశిష్టతను ప్రజలకు చాటి చెప్పేలా కార్యక్రమాలుండాలని  అన్నారు. రాజ్యాంగ రచనలో పాలుపంచుకున్న మహనీయులు బాబా సాహెబ్ అంబేడ్కర్, ఇతర ముఖ్యులకు ప్రతి సంవత్సరం నివాళులర్పిస్తున్నారు. 70 వసంతాలను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారని అన్నారు.  కార్యక్రమంలో జిఏడి డిప్యూటి సెక్రటరీ చిట్టిరాణి, దేవేందర్ రావు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

సూర్యాపేట జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ పై  చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

రాష్ట్రంలో వేడుకగా 680 పాఠశాలలు ప్రారంభం

Murali Krishna

ప్రజలను వంచించిన ఎమ్మెల్యేకు ప్రజలే బుద్ది చెప్తారు

Satyam NEWS

Leave a Comment