నేషనల్ కన్స్యూమర్స్ రైట్స్ కమిషన్ చైర్మన్ సాయి రమేష్ గౌడ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ ఆటోనగర్ లోని లూయిస్ ఆదర్శ అంధుల పాఠశాల లో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అనురాగ్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ వినియోగదారుల చట్టం ప్రజల లోకి వెళ్లి అవగాహన పొంది ప్రజలు మోసపోకుడదు అన్న ఒక మంచి లక్ష్యంతో నేషనల్ కన్స్యూమర్స్ రైట్స్ కమిషన్ సంస్థను ఆయన స్థాపించారని తెలిపారు. వినియోగదారులు తమ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా పిల్లలు పాటలు పాడి, మిమిక్రీ చేసి అలరించారు
previous post