కరోనా కట్టడి చేసేందుకు పోలీసులు, ప్రభుత్వ అధికారులు కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. ప్రజలను అందరిని ఇబ్బంది పెట్టడం కాకుండా కరోనా వైరస్ సోకిన వారు నివసించే ప్రాంతాలను కంటైన్ మెంట్ జోన్ లుకా ప్రకటిస్తున్నారు. ఆ బస్తీల నుంచి ఎవరూ బయటకు రాకుండా, లోనికి ఎవరూ పోకుండా కట్టడి చేశారు.
అయితే అధికారులు, పోలీసులు అనుకున్నది జరుగుతున్నదా? కచ్చితంగా జరగడం లేదు. కంటైన్ మెంట్ జోన్ లో విచ్చలవిడిగా తిరుగుతున్నారు. బస్తీలో యథేచ్ఛగా అటూ ఇటూ ఒకరింటికి ఒకరు వెళుతున్నారు.
వద్దన్నా వినడం లేదు. కరోనా మహమ్మారిని ఈ ప్రజలు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. మియాపూర్ ప్రాంతంలోని హఫీజ్ పేట్ కాలనీలో ఈ దృశ్యం చూస్తే ఈ ప్రజలకు ఎప్పుడు బుద్ధి వస్తుందో అర్ధం కావడం లేదు.