31.7 C
Hyderabad
May 2, 2024 07: 38 AM
Slider నల్గొండ

కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలి

#Contract Labour

కరోనా మహమ్మారితో ముందుండి పోరాటం చేస్తున్న మున్సిపల్ వర్కర్స్ కార్మికులను పర్మినెంట్ చేసి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం 24 వేల రూపాయలు ఇవ్వాలని జిల్లా సిఐటియు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి కోరారు.

సూర్యాపేట జిల్లా  నియోజకవర్గ కేంద్రంలో బుధవారం మున్సిపల్ కమిషనర్ ఎస్ కే యాకుబ్ పాషా కు సమ్మె నోటీసు ఇచ్చిన అనంతరం కార్మికులతో మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నూతన ఆర్థిక విధానాలను దూకుడుగా అమలు చేస్తూ  కార్మికుల, రైతుల, సామాన్య ప్రజల హక్కుల మీద దాడి చేస్తున్నారని ఆరోపించారు.

ఈ నెల 26న జరగనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో  సిఐటియు అనుబంధం అధ్యక్ష, కార్యదర్శులు కస్తాల ముత్తమ్మ, మెరుగ దుర్గారావు, కుమారి,  సైదులు, గోపి, రమణ, చంద్రకళ, రాములు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మునుగోడులో నైతికంగా గెలిచిన కోమటిరెడ్డి

Satyam NEWS

శ్రద్ధా వాకర్ హత్యకు మతం రంగు పులుముతున్న బీజేపీ

Bhavani

సబ్సిడీ ధరలకు ఉల్లిపాయల అమ్మకం ప్రారంభం

Satyam NEWS

Leave a Comment