38.2 C
Hyderabad
April 29, 2024 14: 42 PM
Slider ఆదిలాబాద్

విర్రవీగే టీఆర్ఎస్ కు దుబ్బాక ప్రజలు బుద్ధి చెప్పారు

#BJPKagajnagar

తెలంగాణా రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన తమదే గెలుపని విర్రవీగే TRS పార్టీకి దుబ్బాక ప్రజలు ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీని గెలిపించి TRS కు కర్రు కాల్చి వాతపెట్టారని కొమురం భీం జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి కొంగ సత్యనారాయణ అన్నారు.

కాగజనగర్ మండలంలో పత్రిక సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చలేద కాబట్టే ఈ ఫలితం వచ్చిందని ఆయన అన్నారు. తెలంగాణా ప్రజలు చైతన్య వంతులైనారు కాబట్టే ఏ ఎన్నికలోచ్చిన TRS పార్టీ ఓటమి ఖాయమని ఆయన అన్నారు.

రాబోయే GHMS, ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపు ఖాయం అని దీన్ని బట్టి తెలుస్తుందని ,రానున్న  ఎన్నికలలో సిర్పూర్ తాలూకాలో కూడా కాషాయం జెండా ఎగురవేస్తాం అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సిర్పూర్ తాలూకాలో ఎక్కడా కూడా అభివృద్ధి నోచుకోలేదని, నీళ్లు నిధులు నియామకాలు అని అధికారం లోకి వచ్చిన TRS పార్టీ పూర్తిగా వైఫల్యం చెందిందని ఆయన గుర్తు చేశారు.

TRS, కాంగ్రెస్ పార్టీల పై సిర్పూర్ ప్రజలు విసుగుచెంది ఉన్నారని అన్నారు. SPM లో స్థానికులకు ఉద్యోగాలివ్వకుండా స్థానికేతారులకు ఉద్యోగాలిస్తున్నారన్నారు.  SPM కార్మికుల విషయంలో స్థానిక MLA పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల సమయంలో సిర్పూర్ తాలూకాకు 3 పంటలకు నీరు అందిస్తామని చెప్పిన TRS నాయకులు ఎన్నికల తరువాత ఒక్క పంటకు కూడా నీరిచ్ఛే పరిస్థితి లేదని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో కాగజనగర్ మండల అధ్యక్షులు ఈశ్వర్ దాస్, జిల్లా నాయకులు కాళిదాస్ మూజునుందర్, జిల్లా కార్యదర్శులు, సుమిత్ర సర్కార్, దగంకర్ దిలీప్, సంతోష్ హల్ధార్, సిర్పూర్ తాలూకా నాయకులు గొల్లపల్లి వీరభద్ర చారి,పట్టణ అధ్యక్షులు గోలెం వెంకటేశం, జిల్లా బీజేయం ప్రధాన కార్యదర్శి మెడి కార్తిక్, దళిత మోర్చా నాయకులు దొంగిరి అరుణ్, పట్టణ ప్రధాన కార్యదర్శి గుమ్ముల సాయి కృష్ణ,షెమీర్ గుప్తా,తదితరులు పాల్గొన్నారు.

Related posts

స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల సెంటిమెంట్:ఏపీ ఐఐసీ చైర్మన్ రోజా

Satyam NEWS

సెల్ ఫోన్ వెలుతురులో చంద్రబాబు ప్రసంగం

Satyam NEWS

కుటుంబ సమేతంగా లండన్ వెళ్లనున్న సీఎం జగన్

Bhavani

Leave a Comment