37.2 C
Hyderabad
May 2, 2024 12: 16 PM
Slider జాతీయం

రెండు రోజులుగా తగ్గుతున్న కరోనా కేసులు

#CoronaTest

దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తోంది. కొన్ని రోజులుగా 40 వేలకుపైగానే నమోదవుతున్న విషయం తెలిసిందే.

నిన్న 38 వేలుగా నమోదైన కేసుల సంఖ్య ఈ రోజు 31 వేలకు తగ్గింది. గడిచిన 24 గంటల్లో 9,69,322 పరీక్షలు నిర్వహించగా 31,118 కొత్త కేసులు వెలుగు చూశాయి.

దీంతో మొత్తం కేసుల సంఖ్య 94,62,810కి చేరింది. కొవిడ్‌తో తాజాగా 482 మంది మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,37,621కి చేరింది.

గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 41,985 మంది కోలుకోగా.. మొత్తం డిశ్ఛార్జి అయిన వారి సంఖ్య 88,89,585కి చేరింది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 4,35,603గా ఉంది.

ఇక రికవరీ రేటు 93.94 శాతానికి చేరగా యాక్టీవ్‌ కేసుల సంఖ్య 4.60 శాతానికి తగ్గింది. మరణాల రేటు 1.45 శాతంగా నమోదైంది.

Related posts

శ్రీ రామజన్మభూమి మందిర నిర్మాణానికి కలెక్టర్ ఇంతియాజ్ విరాళం

Satyam NEWS

పోలీసులు ప్రవర్తన బాగోలేదు…!

Bhavani

దేశంలో కరోనా డేంజర్ జిల్లాలు ఆంధ్రాలోనే ఎక్కువ

Satyam NEWS

Leave a Comment