పశ్చిమగోదావరిజిల్లా ఏలూరు నగర కార్పొరేషన్ కు జరగనున్న ఎన్నికలలో 50 డివిజన్ లలో టిడిపి కార్పొరేటర్ లను గెలిపించేందుకు టిడిపి నాయకులు కార్య కర్తలు సైనికుల్లా పనిచేయాలని పశ్చిమగోదావరిజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉంగుటూరు మాజీ ఎం ఎల్ ఏ గన్ని వీరాంజనేయులు పిలుపునిచ్చారు.
శనివారం ఏలూరులో ఏలూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జి బడేటి రాధాకృష్ణయ్య (చంటి) కాంప్ కార్యాలయంలో టిడిపి నాయకులు అత్యవసర సమావేశం జరిగింది. ఈ సందర్భం గా గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ మార్చ్ 10వతేదీన జరిగే ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలలో ఏలూరు కార్పొరేషన్ కార్యాలయంపై టిడిపి జెండా రెప రెప లాడటం ఖాయమని గన్ని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎం ఎల్ సి మంతెన సత్యనారాయణరాజు.(పాండవ శ్రీను) మాట్లాడుతూ ఏలూరు నగర అభివృద్ధికి దివంగత ఎం ఎల్ ఏ బడేటి బుజ్జ చేసినకృషి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించిన సంక్షేమ పథకాలు ఏలూరు నగర కార్పొరేషన్ ను టిడిపి సొంతం చేసుంటుందని ఏలూరు నగర కార్పొరేషన్ పై టిడిపి జెండా ఎగురవేసి ఈ విజయాన్ని చంద్రబాబు నాయుడు కు బడేటి బుజ్జికి కానుకగా ఇస్తామని ఎం ఎల్ సి మంతెన సత్యనారాయణరాజు అన్నారు.
ఈకార్యక్రమంలో దెందులూరు మాజీ ఎం ఎల్ ఏ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి కార్పొరేటర్ గెలవలేమనే భయాన్ని వీడి తప్పనిసరిగా గెలవాలి అనే మనో ధైర్యం నింపుకుని విజయం సాధించాలని టిడిపి కార్పొరేటర్ అభ్యర్థులకు పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి బడేటి చంటి.పాలి ప్రసాద్ .ఉప్పాల జగదీష్ బాబు దాసరి ఆంజనేయులు..మాజీ ఏ ఎం సి చైర్మన్ పూజారి నిరంజన్.లింగిశెట్టి సాయికుమార్.గూడవల్లి వాసు తదితరులు పాల్గొన్నారు