25.7 C
Hyderabad
May 9, 2024 09: 15 AM
Slider పశ్చిమగోదావరి

ఏలూరు కార్పొరేషన్ గెలిచేందుకు సమష్టిగా కృషి చేయాలి

#GanniVeeranjaneyulu

పశ్చిమగోదావరిజిల్లా ఏలూరు నగర కార్పొరేషన్ కు జరగనున్న ఎన్నికలలో 50 డివిజన్ లలో టిడిపి కార్పొరేటర్ లను గెలిపించేందుకు టిడిపి నాయకులు కార్య కర్తలు సైనికుల్లా పనిచేయాలని పశ్చిమగోదావరిజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉంగుటూరు మాజీ ఎం ఎల్ ఏ గన్ని వీరాంజనేయులు పిలుపునిచ్చారు.

శనివారం ఏలూరులో ఏలూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జి బడేటి రాధాకృష్ణయ్య (చంటి) కాంప్ కార్యాలయంలో టిడిపి నాయకులు అత్యవసర సమావేశం జరిగింది. ఈ సందర్భం గా గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ మార్చ్ 10వతేదీన జరిగే ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలలో ఏలూరు కార్పొరేషన్ కార్యాలయంపై టిడిపి జెండా రెప రెప లాడటం ఖాయమని గన్ని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎం ఎల్ సి మంతెన సత్యనారాయణరాజు.(పాండవ శ్రీను) మాట్లాడుతూ ఏలూరు నగర అభివృద్ధికి దివంగత ఎం ఎల్ ఏ బడేటి బుజ్జ చేసినకృషి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించిన సంక్షేమ పథకాలు ఏలూరు నగర కార్పొరేషన్ ను టిడిపి సొంతం చేసుంటుందని ఏలూరు నగర కార్పొరేషన్ పై టిడిపి జెండా ఎగురవేసి ఈ విజయాన్ని చంద్రబాబు నాయుడు కు బడేటి బుజ్జికి కానుకగా ఇస్తామని ఎం ఎల్ సి మంతెన సత్యనారాయణరాజు అన్నారు. 

ఈకార్యక్రమంలో దెందులూరు మాజీ ఎం ఎల్ ఏ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి కార్పొరేటర్ గెలవలేమనే  భయాన్ని వీడి తప్పనిసరిగా గెలవాలి అనే  మనో ధైర్యం నింపుకుని విజయం సాధించాలని టిడిపి కార్పొరేటర్ అభ్యర్థులకు పిలుపునిచ్చారు   

ఈ కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి బడేటి చంటి.పాలి ప్రసాద్ .ఉప్పాల జగదీష్ బాబు దాసరి ఆంజనేయులు..మాజీ ఏ ఎం సి చైర్మన్ పూజారి నిరంజన్.లింగిశెట్టి సాయికుమార్.గూడవల్లి వాసు తదితరులు పాల్గొన్నారు

Related posts

నాలుగు సంవత్సరాలు గడిచినా నూతన ఆసరా పింఛన్లు మంజూరు చేయరా?

Satyam NEWS

రోడ్ ప్ర‌మాదాలకు కార‌ణాలు అన్వేషించే ప‌ని కూడా చేస్తున్న ఖాకీలు…!

Satyam NEWS

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కుక్క కూడా కరవదు…..

Satyam NEWS

Leave a Comment