31.7 C
Hyderabad
May 2, 2024 08: 42 AM
Slider ఆంధ్రప్రదేశ్

ఏపిలో ఆగని కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య

kurnool city

ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకి పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో 19 కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదు అయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 502 కు చేరుకుంది. నిన్న సాయంత్రం 5 నుండి ఈ రోజు 9 వరకు జరిపిన పరీక్షల్లో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం.

గుంటూరు జిల్లా లో 4, పశ్చిమ గోదావరి జిల్లాలో 8, కర్నూలు జిల్లాలో 6, కృష్ణా జిల్లా లో 1 కేసు తాజాగా  నమోదు అయ్యాయి. గుంటూరులో అత్యధికంగా 118 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ కరోనా పాజిటివ్ తో 11 గురు మృతి చెందారు. కరోనా పాజిటివ్ చికిత్స తీసుకుని 16 మంది డిశ్చార్జ్ అయ్యారు.

Related posts

క్షయ రహిత సమాజ నిర్మాణమే ధ్యేయం

Satyam NEWS

ప్రధాన రహదారి నిర్మాణం త్వరితగతిన చేపట్టాలి

Satyam NEWS

కాంగ్రెస్ లో చేరనున్న బిఆర్ఎస్ ఎంపీ?

Bhavani

Leave a Comment