ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకి పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో 19 కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదు అయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 502 కు చేరుకుంది. నిన్న సాయంత్రం 5 నుండి ఈ రోజు 9 వరకు జరిపిన పరీక్షల్లో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం.
గుంటూరు జిల్లా లో 4, పశ్చిమ గోదావరి జిల్లాలో 8, కర్నూలు జిల్లాలో 6, కృష్ణా జిల్లా లో 1 కేసు తాజాగా నమోదు అయ్యాయి. గుంటూరులో అత్యధికంగా 118 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ కరోనా పాజిటివ్ తో 11 గురు మృతి చెందారు. కరోనా పాజిటివ్ చికిత్స తీసుకుని 16 మంది డిశ్చార్జ్ అయ్యారు.