ఇటీవల జరిగిన దుబ్బాక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందడం చారిత్రాత్మకమైన విజయమని ఇందుకు సహకరించిన దుబ్బాక ప్రజలకు, ఓటర్లకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్, ఎంపీ సోయం బాబబూరావు, ఎమ్మెల్యే రాజా సింగ్, శ్రీరాములు యాదవ్, బిజెపి కార్యకర్తలకు కార్పొరేటర్ రామిడి మాధురి వీర కర్ణారెడ్డి పేర్కొన్నారు.
మార్పు మొదలు..
తెలంగాణ రాష్ట్ర ప్రజలలో మార్పు మొదలైందని చెప్పడానికి ఈ విజయం తార్కాణమని, ఒక శుభ సూచికని 2018 లో జరిగిన ఎలక్షన్లలో బిజెపి పార్టీకి 20 వేల పైచిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయని, ఉప ఎన్నికల్లో 63 వేల పైచిలుకు ఓట్లు రావడం అనేది ఇక బిజేపి విజయోత్సవాల ఆరంభానికి శుభసూచకమన్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీ శ్రేణులు ఇదే విధంగా పనిచేసి వార్డు మెంబర్ నుంచి ఎంపీ వరకు బిజెపి నాయకులను గెలిపించాలని కోరారు.