రోజు రోజుకు విస్తరిస్తున్న న్యూస్ తో సహా ఆన్ లైన్ కంటెంట్ ను కేంద్ర సమాచార ప్రసారాల శాఖ పరిధిలోకి తీసుకువస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్సు తీసుకువచ్చింది.
ఆన్లైన్ సినిమాలు, ఆడియో వీడియో ప్రోగ్రాములు, ఆన్లైన్ న్యూస్, కరెంట్ ఎఫైర్స్ కార్యక్రమాలను ఇక నుంచి కేంద్ర సమాచార ప్రసారాల శాఖ పర్యవేక్షిస్తుంది.
యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్ పరిధిలోకి తెస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో సోషల్ మీడియా నెట్ వర్క్ ల క్రమబద్దీకరణ జరుగుతుంది.