42.2 C
Hyderabad
April 30, 2024 15: 10 PM
Slider రంగారెడ్డి

దేశ అభివృద్ధి బిఅర్ఎస్  తోనే సాధ్యం

#bontusridevi

దేశ అభి వృద్ది బీఆర్ఎస్ తోనే సాధ్యం మవుతొందని చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ అన్నారు.  బుధవారం టిఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించిన సందర్భంగా ప్రకటనకు మద్దతుగా  చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్, మాజీ కార్పొరేటర్ గొల్లూరు అంజయ్య ల ఆధ్వర్యంలో  చక్రిపురం చౌరస్తా వద్ద బాణసంచా పేల్చి , సంబరాలు నిర్వహించి మిఠాయిలు పంచిపెట్టారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ బొంతు శ్రీదేవి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు అది పెద్ద పండగ రోజు అయిన దసరా వేళ సీఎం కెసిఆర్ జాతీయ పార్టీ ని ప్రకటించడం దేశంలోనే ఒక చారిత్రాత్మకమైన రోజుగా అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు ఉద్యమం చేసి సకల జనులను ఏకం చేసి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ బిడ్డ సీఎం కెసిఆర్ అని అన్నారు. నేడు దేశంలో బీజేపీ పాలనలో అన్ని రంగాల్లో వెనుకబడి పోయిందని, దేశంలో 28 రాష్ట్రాల్లో అభివృద్ది శూన్యమని తెలిపారు. సీఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అగ్ర స్థానంలో ఉందని తెలిపారు.

తెలంగాణ పథకాలు నేడు దేశానికే ఆదర్శంగా ఉన్నాయనో, ఇక్కడి పథకాలు దేశంలో అమలు కావాలంటే బిఆర్ఎస్ తోనే సాధ్యమని చెప్పారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులు కెసిఆర్ పక్షాన ఉన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజానీకం కెసిఆర్ కు అండగా ఉండి కుల, మత రాజకీయాలు చేసే పార్టీలకు చరమగీతం పాడాలని, అది కేవలం బి అర్ ఎస్ పార్టీతోనే సాధ్యమన్నారు. గతంలో ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీని చులకన చేసి మాట్లాడిన వారు నేడు బిఅర్ఎస్ ను చులకన చేస్తున్నారని, ప్రజల అభిమానం, ఆదరణ కెసిఆర్ వైపే ఉందని పేర్కొన్నారు. భారత దేశానికి కెసిఆర్ లాంటి నాయకుల అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస రాష్ట్ర యువజన కార్యదర్శి కనకరాజు గౌడ్, టిఆర్ఎస్ నాయకులు బాల్రెడ్డి, కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

నిరుపేదకు వైద్య సాయం చేసిన కాంగ్రెస్ నేతలు

Satyam NEWS

స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి

Satyam NEWS

18 ఏళ్లుగా షబ్బీర్ అలీ ఇంట్లో విద్యుత్ ఉద్యోగి

Satyam NEWS

Leave a Comment