తీవ్ర అనారోగ్యంతో మూత్రపిండాలు చెడిపోయి ఇబ్బందులు పడుతున్న ఒక వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ బాసటగా నిలిచింది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన కన్నాజీని తాము ఆదుకుంటామని తలమడుగు ZPTC గోక గణేష్ రెడ్డి ముందుకు వచ్చారు. ఆదిలాబాద్ పట్టణంలోని K.R.K కాలనీకి చెందిన కన్నాజి భూమన్న గత రెండు సంవత్సరాల నుండి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మంచానికి పరిమితమైనాడు.
భూమన్న మెడికల్ ఖర్చులకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని తలమడుగు ZPTC గోక గణేష్ రెడ్డి అందచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు సాజిద్ ఖాన్, KRK కాలనీ కౌన్సిలర్ షేక్ ముబారక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రకాష్ రావు, ఖయ్యుం, శివ తదితరులు పాల్గొన్నారు.