సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన Covid – 19 టీకా డ్రై రన్ కార్యక్రమంలో హుజుర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైది రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ త్వరలో టీకా వచ్చాక ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అందరూ దశల వారీగా టీకా తీసుకోవాలని అన్నారు.
Covid – 19ని అంతమోదించాలని అన్నారు. కరోనా కష్ట కాలంలో మున్సిపల్ సిబ్బంది, ఆశావర్కర్లు, ఏ ఎన్ ఎమ్ లు అందరూ కలిసి తమవంతు బాధ్యత పనిచేశారని కొనియాడారు.
ప్రతి ఒక్కరు కరోనా జాగ్రత్తలు, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి, డా.ఫిరోజ్, వైద్యసిబ్బంది, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.