33.7 C
Hyderabad
April 29, 2024 00: 02 AM
Slider ముఖ్యంశాలు

బండి సంజయ్ పై ధ్వజమెత్తిన వామపక్ష నాయకులు

#cpi

దేశంలో మదరసాలను, మసీదులను ధ్వంసం  చేయాలంటూ బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వామపక్ష నాయకులు తీవ్రంగా ఖండించారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో పెరిగిన పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ నిత్యావసర సరుకుల ధరలకు నిరసనగా సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా సిపిఐ నాయకులు యూసుఫ్ సిపిఐ మహిళా నాయకురాలు ఇంద్ర సిపిఎం నాయకులు శివ వర్మ లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అవసరమయ్యే నిత్యావసర వస్తువుల ధరలను ఆకాశాన్ని తాకే విధంగా అమాంతం పెంచారని మండిపడ్డారు ప్రజలకు అవసరమయ్యే సమస్యల పైన కాకుండా మదర్సాలను మసీదులను కుంచాల అంటూ ఇటీవల బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ భారత దేశ స్వాతంత్రం పూర్వం నుండి దేశంలో మద్రాసలు ఉన్నాయని అన్నారు.  

దేశ స్వతంత్ర ఉద్యమంలో ఎందరో ముస్లిం సోదరులు పాల్గొన్నారని చరిత్ర తెలియకుండా బండి సంజయ్ మదరసలను మసీదులను కూల్చాలంటూ మాట్లాడడం సరైంది కాదని ఏదైతే బండి సంజయ్ చేసిన వాక్యాలు ఉండే వాటిని వెనక్కి తీసుకోవాలని పెరిగిన పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ నిత్యావసర సరుకుల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వాలు తగ్గించాలని లేనిపక్షంలో వామపక్షాల ఆధ్వర్యంలో దేశం మొత్తంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కురుమయ్య మద్దిలేటి తుమ్మల శివ సిపిఎం నాయకులు సలీం తారా సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎక్సపర్ట్ కామెంట్రీ: ఉండవెల్లి మౌనం ఎప్పుడు వీడతారో?

Satyam NEWS

తాడేపల్లిలో సీఎం జగన్ తో సినీ నటుల భేటీ

Satyam NEWS

భూసార ప‌రీక్షా కేంద్రం.. సొంత ఖ‌ర్చుల‌తో నిర్మించిన పువ్వాడ అజ‌య్‌..

Sub Editor

Leave a Comment