తెలంగాణ రాష్ట్రంలో మతతత్వ నిరంకుశ విధానాలకు ప్రత్యామ్నాయం CPI పార్టీనేనని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్న చంద్రశేఖర్ అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం CPI సభ్యత్వ నమోదును ప్రారంభించిన సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో CPI పార్టీ బలోపేతమయ్యేందుకు సరైన అవకాశాలు నేడు నెలకొన్నాయన్నారు.
బూర్జువా వర్గాలను నశింప చెయ్యాలంటే వామపక్షాల వల్ల మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు.CPI పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో CPI జిల్లా కార్యవర్గసభ్యులు యల్లావుల రాములు,సిపిఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు,జాతీయ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరం మల్లీశ్వరి,
జిల్లా గౌరవ అధ్యక్షురాలు పశ్య పిచ్చమ్మ ,నాయకులు జక్కుల రమేష్,సోమగాని కృష్ణ, చెన్నగానీ వెంకటేష్,దేవరం సుజాత,పశ్య లక్ష్మీ,పులిచింతల వెంకటమ్మ,పశ్య వీణా,ఎస్.కె.ఆషా ,చెన్నగానీ రామనర్సమ్మ,ఉస్తేల రాములమ్మ, రామనర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.