27.7 C
Hyderabad
April 26, 2024 05: 57 AM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ ప్రజలకు ఆర్ సీ ఎం ప్రొడక్ట్స్ ప్రారంభించిన సిఐ వెంకట్ రెడ్డి

#Kollapur Police

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో ఆర్ సి ఎం ప్రొడక్ట్స్ సెంటర్ ను సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ బి. వెంకట్ రెడ్డి ప్రారంభించారు. సోమవారం పట్టణ కేంద్రంలోని నూతనంగా  ఆర్ సీ ఏం ప్రొడక్ట్స్ (నిత్యావసర వస్తువులు) సెంటర్ ను  మహబూబ్  ఫంక్షన్ హాల్ ఎదురుగా ఏర్పాటు చేశారు.

ముఖ్యఅతిథిగా   సీఐ బి.వెంకట్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేసి రిబ్బన్ కట్ చేసి  ప్రారంభించారు. ఈ సందర్భంగా మొదటగా  ఆర్ సి ఎం సెంటర్ లో  నిత్యవసర వస్తువులు కొనుగోలు చేశారు. యజమాని సురేష్ కు  సీఐ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

అదేవిధంగా మున్సిపల్ చైర్ పర్సన్ రఘు ప్రోలు విజయలక్ష్మి చంద్ర శేఖర చారి, మార్కెట్ యార్డ్ చైర్మన్ జి.నరేందర్ రెడ్డి ప్రారంభోత్సవంలో పాల్గొని నిత్యవసర వస్తువులను కొనుగోలు చేశారు.

ఈ సందర్భంగా ప్రజలకు ఆర్ సి ఎం సెంటర్ యజమాని సురేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. షాపుల్లో కొనుగోలు చేసే నిత్యవసర వస్తువులు ఆర్ సి ఎం సెంటర్లో లభిస్తాయని చెప్పారు. ఆర్ సి ఎం వస్తువులు ఆరోగ్యానికి కి ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ఆహార వస్తువులలో పోషక ఆహార పదార్థాలు ఉంటాయని తెలిపారు. ప్రతి వస్తువు  ఆర్ సి ఎం సెంటర్ లో లభిస్తుందని చెప్పారు.

అంతకుముందు ఆర్ సి ఎం ప్రొడక్ట్స్ (సబ్బు)బయట లభించే  ప్రోడక్ట్స్ తేడాలను  సిఐ వెంకట్ రెడ్డి,మున్సిపల్ చైర్ పర్సన్ రఘుప్రొలు విజయలక్ష్మి చంద్ర శేఖర చారి, మార్కెట్ యార్డ్ చైర్మెన్ జి.నరేందర్ రెడ్డి పరిశీలించారు.

Related posts

కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రికి ఎంపీ రఘురామ లేఖ

Satyam NEWS

వివేకాను కుట్ర చేసి చంపింది వాళ్లే….

Satyam NEWS

రోడ్ల విస్తరణ పూర్తి అయితే చూడలేకపోతున్నారా?

Satyam NEWS

Leave a Comment