బాగ్ అంబర్ పేట్ డివిజన్ లోని అయ్యప్ప స్వామి గుడి ఎదురు గల్లీలో రెండు నెలలు క్రింద నూతనంగా రోడ్డు వేసి సైడ్ ప్యాచ్ వర్క్ మాత్రం వేయకుండా కాంట్రాక్టర్లు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని టీఆర్ఎస్ డివిజన్ సీనియర్ నాయకులు జీవన్ గౌడ్ ఆరోపించారు.
రెండుమూడుసార్లు అధికారులకు చెప్పినా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని రేపు, మాపు చేయిస్తామని చెప్పి జారుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటి వరకు ప్యాచ్ వర్క్ వేయలేదని ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. అధికారులు ఎప్పుడూ నూతన పనులు పనుల కోసం చూస్తూ ఉంటారు ఎందుకంటే అవి తొందరగా మొదలు పెడితే వారికి గిట్టుబాటు అవుతుందని వారి ఉద్దేశ్యమని ఆయన అన్నారు. కమిషన్లు రావు కాబట్టి పెండింగ్లో ఉన్న పనులు చేపట్టరని ఆయన తెలిపారు. ఇంత అసమర్థ అధికారులు ఏ డివిజన్ లో కూడా ఉండరని ఆయన అన్నారు.