28.7 C
Hyderabad
April 28, 2024 08: 29 AM
Slider మెదక్

గుడిసెలు తగలబెట్టిన వారిని వెంటనే శిక్షించాలి

#CPMSiddipet

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని మారెమ్మ టెంపుల్ పరిధిలో పిట్టల వారి గుడిసెలు తగలబెట్టిన వారిని వెంటనే శిక్షించాలని సీపీఎం డిమాండ్ చేసింది. పిట్టల వారి గుడిసెల పైన డీజిల్ పోసి తగలబెట్టిన గుడిసెలను సందర్శిస్తున్న సిపిఎం పార్టీ నాయకులు అనంతరం సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు జి భాస్కర్ మాట్లాడుతూ పిట్టల వారు గుడిసెలు వేసుకొని  గత కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారని అన్నారు.

ప్రకృతి పరంగా వచ్చే పండ్లను సేకరించుకుని జీవనోపాధి కొనసాగిస్తున్నారని ఈ సందర్భంలో గుడిసెలో మామిడికాయలను టoకర చేసి నిల్వ ఉంచిన కాలియా జయరామ్ తండ్రి గంగారాం గారి గుడిసే పైన డీజిల్ పోసి గత రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు డీజిల్ పోసి తగల పెట్టడం జరిగిందని అన్నారు.

అలాంటి వారిని వెంటనే  శిక్షించాలని డిమాండ్ చేశారు. పొద్దంతా కష్టం చేసి మామిడికాయలను టoకరగా మార్చి ఆ గుడిసెలో నిల్వ చేసుకోవడం జరిగిందని దాన్ని చూసి అయినటువంటి వారు ఇలా తగలబెడుతూ వారి కుటుంబాలను ఆర్థికంగా దెబ్బ తీయాలనుకోవడం సరైందికాదని అలాంటి వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అన్నారు.

పిట్టల వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. గుడిసెతోపాటు వారికి గుడిసె లో ఉన్నటువంటి మామిడి టoకర్ కు సంబంధించి సుమారుగా 30 వేల వరకు నష్టం జరిగిందని ఆ కుటుంబాలను వెంటనే ప్రభుత్వం ఆదుకొవాలని  ప్రభుత్వానికి కోరారు.

ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇంతవరకు ఇవ్వకపోవడం తో పాటు వాళ్ల గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుడిసెలోకి రోజు పాములు,తేళ్లు రావడంతో ప్రాణభయం కూడా రోజురోజుకు నెలకొంటుందని ఇలాంటి పరిస్థితుల వల్ల కుటుంబాలను వెంటనే ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలోకి పంపించాలని అన్నారు.

వారి కుటుంబాలను ఆదుకొని జీవనోపాధి కోసం కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పెంటి సాయికుమార్,బత్తుల రాజు, మరియు పిట్టల వారు జయరామ్,చలపతి, చెన్నయ్య, లింగం, చంద్రం,లత, ప్రేమల, లక్ష్మి, పద్మ, తదితరులు పాల్గొన్నారు.

Related posts

అంబర్ పేట ఇన్స్సెక్టర్ పై కేసు నమోదు

Bhavani

విజన్ డాక్యుమెంట్: స్థానిక సంస్థలకు అధికారాలేవి?

Satyam NEWS

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

Satyam NEWS

Leave a Comment