Slider రంగారెడ్డి

సిపిఆర్ తో వ్యక్తి ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్

#cybarabad

సైబరాబాద్ పరిధిలోని ఎల్బీ నగర్  ప్రాంతానికి చెందిన బాలరాజు అనే వ్యక్తి ఆరం ఘర్ చౌరస్తా వద్ద ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలాడు. దీంతో అక్కడే విధుల్లో ఉన్న రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ అతనికి సిపిఆర్ చేశాడు. అనంతరం ఉన్నతాధికారుల సూచనల మేరకు వెంటనే అతని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. ప్రస్తుతం అతడు క్షేమంగా ఉన్నాడు. సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి  హర్షవర్ధన్ శంషాబాద్ ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస నాయుడు, రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్ రెడ్డి సమక్షంలో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర కానిస్టేబుల్ సమయస్ఫూర్తిని అభినందించి రివార్డు అందజేశారు.

Related posts

పెళ్లి పేరుతో డాక్టర్ ను కూడా మోసం చేసిన ఘనుడు

Satyam NEWS

నిబంధనలను పాటిస్తూ కొత్త సంవత్సర వేడుక నిర్వహించుకుందాం

Satyam NEWS

హైదరాబాద్ మెట్రో రైల్ పుస్తకానికి జాతీయ అవార్డు

Satyam NEWS

Leave a Comment