తన పాటలతో ప్రజలను చైతన్య పరుస్తూ మునుగోడుకు సైకిల్ యాత్ర ద్వారా చేరుకున్నారు ఫ్లూటిస్ట్ ప్రకాష్. భద్రాచలం నుంచి ప్రారంభమయిన సైకల్ యాత్ర మునుగోడు నియోజకవర్గంలో సాగింది. ఈ సందర్భంగా మునుగోడు లో ఉపఎన్నికల ప్రచారంలో ఉన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని ప్రకాష్ కలిశారు. ఖమ్మం జిల్లా వాసైన తూటిక ప్రకాష్ కొర్టికల్ గ్రామంలో మంత్రి పూవ్వాడని కలిసి తన యాత్ర విశేషాలను తెలియజేశారు. మునుగోడు లో తెరాస పార్టీ ఘన విజయం సాగిస్తుంది అని జోస్యం చెప్పారు. తన యాత్ర లో ప్రజల్లో కేసీఆర్ పట్ల అమితమైన గౌరవాన్ని చూసానని, రానున్న ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాల్లో ప్రజల మనసుల్లో టిఆర్ఎస్ ఉందని బలంగా తెలుస్తుందన్నారు. ప్రజల అభిమానించే పార్టీగా టిఆర్ఎస్ ప్రజల మనస్సుని చూరగొన్నదని పేర్కొన్నారు. తెలంగాణ వుద్యమంలో తాను కూడా పాల్గొన్నానని తెలిపారు.
previous post