రేషన్ మాఫీయాను టార్గెట్ చేసిన పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-చార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు నిన్న తెల్లవారు జామున 5 గంటలకు వెళ్లి రేషన్ బియ్యం లారీని పట్టుకున్నారు. నరసరావుపేట ఎమ్మెల్యే కనుసన్నల్లోనే రేషన్ మాఫీయా నడుస్తున్నదని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కామదేను ట్రేడర్స్ లో అక్రమ రవాణాకు సిద్దమైన లారి అరవింద బాబు రాకతో అలెర్ట్ అయింది. దాంతో రేషన్ మాఫీయా గుట్టు రట్టు అయింది. మిల్లు నుంచి కొంత మంది పరారీ కాగా ఈ మేరకు డా౹౹చదలవాడ అధికారులకు సమాచారం ఇచ్చారు.
previous post