32.2 C
Hyderabad
May 2, 2024 00: 25 AM
Slider ముఖ్యంశాలు

5 నెలల గరిష్టానికి రోజువారీ కేసులు

#corona

దేశంలో కరోనా కేసులు సంఖ్య నెమ్మదిగా పెరుగుతున్నాయి.గత కొన్ని రోజుల నుంచి వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. కొన్నాళ్ల వరకు కేసుల సంఖ్య కేవలం వందల్లోనే ఉండేది.కానీ,ఇప్పుడు పరిస్థితి మారుతోంది. తాజాగా 5 నెలల గరిష్టానికి రోజూవారీ కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో 1,890 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర,గుజరాత్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు, కేరళలో ముగ్గురు మరణించారు. చివరిసారిగా గతేడాది ఒకే రోజు 2,208 కేసులు నమోదు కాగా,దాదాపుగా 149 రోజుల తర్వాత 1,890 కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 9,433గా ఉంది. డైలీ పాజిటివిటీ రేట్ 1.56 శాతంగా నమోదైంది.వీక్లీ పాజిటివిటీ రేట్ 1.29 శాతంగా ఉంది.దేశంలో కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 4.47 కోట్లు(4,47,04,147)గా కేసులు నమోదయ్యాయి. వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య ,41,63,883కి చేరుకోగా,కేసు మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది.ప్రభుత్వం వ్యాక్సిన్ డ్రైవ్ ద్వారా 220.65 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు అందించింది.

Related posts

పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ

Satyam NEWS

రాజ్యసభ ఎన్నికలతో పాటు బడ్జెట్ సమావేశాలు

Satyam NEWS

బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్ కుమార్

Satyam NEWS

Leave a Comment